Thursday, 16 April 2026 10:55:06 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

కొత్వాల శ్రీనివాసరావుకు ఘన సన్మానం

Date : 30 January 2024 09:42 PM Views : 924

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : రైతుల శ్రేయస్సే ధ్యేయంగా నిత్యం విధులు నిర్వర్తిస్తానని ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ కో-ఆపరేటివ్ అధ్యక్షులుగా ఉన్న కొత్వాల డీసీఎంఎస్ చైర్మన్ గా ఎన్నికవ్వడాన్ని హర్షిస్తూ సొసైటీ పాలకవర్గం ఆయనను ఘనంగా సన్మానించింది. మంగళవారం పాల్వంచ సొసైటీ కార్యాలయంలో ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ తోపాటు డైరెక్టర్లు, సిబ్బంది కొత్వాలను పూలమాలలు, బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా సొసైటీ అధ్యక్షునిగా నిత్యం రైతులకు అందుబాటులో వుంటున్నానన్నారు. పాల్వంచ సొసైటీని తెలంగాణ రాష్ట్రంలోనే ద్వితీయ ఉత్తమ సొసైటీ గా తీర్చిదిద్దనన్నారు. ఉత్తమ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యానన్నారు. తనకు పాల్వంచ సొసైటీ పాలకవర్గం, సిబ్బంది, రైతులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, వారికీ జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ గా ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కొత్వాల తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, డిసిసిబి మేనేజర్ ఎ.స్వప్న, సూపర్వైజర్ వనమా సురేష్ కుమార్, డైరెక్టర్లు బుడగం రామమోహన్ రావు, కనగాల నారాయణ రావు, చౌగాని పాపారావు, సామా జనార్దన్ రెడ్డి, జరబన సీతారాంబాబు, మైనేని వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి మధు, నిమ్మల సువర్ణ, బర్ల వెంకటరమణ, భూక్యా కిషన్, సీఈవో జి.లక్ష్మీనారాయణ, సురేందర్ రెడ్డి, లక్ష్మి, శోభారాణి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :