Monday, 02 March 2026 12:30:39 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

శభాష్ డాక్టర్ పోటు వినోద్

Date : 28 August 2024 06:59 PM Views : 2632

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు నిర్వహించే కొంతమంది వైద్యులు పని సమయం చూసుకుంటూ వైద్యం చేస్తుంటారు. కానీ కొంతమంది వైద్యులు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తుంటారు. అదే కోవకు చెందినవారు డాక్టర్ పోటు వినోద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డెంటల్ యూనిట్ ఇటీవల ఓ ఆదివాసీ గిరిజనుడికి దంత వైద్య నిపుణులు పోటు వినోద్ ఖరీదైన ఆపరేషన్ చేశారు. లక్ష్మీదేవీపల్లి మండలం గట్టుమళ్లకు చెందిన కుంజా కన్నారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతనికి పై, క్రింది దవడలు విరిగి పోయాయి. గట్టుమళ్లకు చెందిన ఇండోస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు డాక్టర్ నరేందర్ మల్కాజిగిరి ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న దంత వైద్యుడు పోటు వినోద్ కు  ఫోన్ ద్వారా పరిస్థితి వివరించారు. డాక్టర్ వినోద్ గతంలో జూలూరుపాడులో విధులు నిర్వర్తించిన నేపథ్యంలో మల్కాజిగిరి నుంచి వచ్చి శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు 2 గంటలపాటు శ్రమించి పై దవడలకు స్టీల్ ప్లేట్లు అమర్చారు. ఇదే చికిత్స కార్పొరేట్ ఆస్పత్రిలో చేస్తే సుమారు రూ.2.50 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్ వినోద్  తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్వ కలెక్టర్ రజత్ కుమార్ శైనీ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని జూలూరుపాడు డెంటల్ యూనిట్ లో  మిషనరీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారని, అందుకే ఇక్కడికి వచ్చి వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పోటు వినోద్ మాట్లాడుతూ పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :