Friday, 07 November 2025 03:36:01 AM
# కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు # కాంపెల్లి కనకేష్ ఇంట... కవితక్క సందడి... # ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాడిశ బిక్షం దొర # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు

శభాష్ డాక్టర్ పోటు వినోద్

Date : 28 August 2024 06:59 PM Views : 2456

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు నిర్వహించే కొంతమంది వైద్యులు పని సమయం చూసుకుంటూ వైద్యం చేస్తుంటారు. కానీ కొంతమంది వైద్యులు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తుంటారు. అదే కోవకు చెందినవారు డాక్టర్ పోటు వినోద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డెంటల్ యూనిట్ ఇటీవల ఓ ఆదివాసీ గిరిజనుడికి దంత వైద్య నిపుణులు పోటు వినోద్ ఖరీదైన ఆపరేషన్ చేశారు. లక్ష్మీదేవీపల్లి మండలం గట్టుమళ్లకు చెందిన కుంజా కన్నారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతనికి పై, క్రింది దవడలు విరిగి పోయాయి. గట్టుమళ్లకు చెందిన ఇండోస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు డాక్టర్ నరేందర్ మల్కాజిగిరి ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న దంత వైద్యుడు పోటు వినోద్ కు  ఫోన్ ద్వారా పరిస్థితి వివరించారు. డాక్టర్ వినోద్ గతంలో జూలూరుపాడులో విధులు నిర్వర్తించిన నేపథ్యంలో మల్కాజిగిరి నుంచి వచ్చి శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు 2 గంటలపాటు శ్రమించి పై దవడలకు స్టీల్ ప్లేట్లు అమర్చారు. ఇదే చికిత్స కార్పొరేట్ ఆస్పత్రిలో చేస్తే సుమారు రూ.2.50 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్ వినోద్  తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్వ కలెక్టర్ రజత్ కుమార్ శైనీ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని జూలూరుపాడు డెంటల్ యూనిట్ లో  మిషనరీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారని, అందుకే ఇక్కడికి వచ్చి వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పోటు వినోద్ మాట్లాడుతూ పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :