Saturday, 27 July 2024 01:14:57 PM
# ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి # హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు # చదువులో వెలిగిన కాంపెల్లి కిరణ్మయి # నేను పోలీస్ ఇన్ ఫార్మర్ ని...!! # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కిన్నెర ఏజెన్సీస్ # శభాష్ సుభాని

పాల్వంచలో నిబంధనలకు "తుక్కు"

Date : 22 May 2024 12:09 PM Views : 497

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : పారిశ్రామిక ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్ర్కాప్‌ దుకాణాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. లక్షలు కురుపించే వ్యాపారం కావడంతో చాలా మంది దృష్టి ఈ వ్యాపారంపైకి మళ్లింది. అయితే అనుమతి లేకుండా.. నిబంధనలు పట్టకుండా వ్యాపారం సాగుతోంది. వీటికి పన్ను కట్టక్కర్లేదు. జీఎస్టీ చెల్లింపులు అక్కర్లేదు. అందుకే పాల్వంచ పట్టణంలో పుట్టగొడుగుల్లా స్క్రాప్ దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. తొలుత జీవనోపాధికి పెట్టుకున్న ఈ షాపులు క్రమేపీ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరిస్తున్నాయి. ఒక్క పాల్వంచ పట్టణంలోనే దాదాపు 50 స్ర్కాప్‌ దుకాణాలు ఉన్నాయి. నిత్యం ఇవి పాత సామాన్లతో కిటకిటలాడుతుంటాయి. సాధారణంగా స్థానిక సంస్థల అనుమతితోనే స్ర్కాప్‌ దుకాణాలు ఏర్పాటుచేయాలి. పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటుచేస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఇది జరగడం లేదు. స్ర్కాప్‌ కొనుగోలు, విక్రయాలు బిల్లు చెల్లింపుల ద్వారా జరగాలి. కానీ లారీలకు లారీలు లోడ్లతో స్ర్కాప్‌ తరలుతున్నా ఎటువంటి పన్నులు చెల్లించడం లేదన్న ఆరోపణలున్నాయి. తప్పుడు వే బిల్లుతో తరలిస్తున్నట్టు సమాచారం. స్ర్కాప్‌ దుకాణాల వల్లే ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే ఊరికి దూరంగా నిర్వహించుకోవాలన్న స్పష్టమైన నిబంధన ఉంది. ఇది అమలవుతున్న దాఖలాలు లేవు. స్ర్కాప్‌మాటున భారీగా శ్రమదోపిడీ జరుగుతోంది. సాధారణంగా స్ర్కాప్‌ ఏరుకునే వారితో వ్యాపార ఒప్పందం చేసుకుంటారు. నిరుపేదలకు డబ్బులు ఆశచూపుతున్నారు. వారి నుంచి వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువకు విక్రయిస్తున్నారు. రైల్వే, టెలికాంతో పాటు ప్రభుత్వరంగ సంస్థలు వినియోగించే వస్తువులు కొనడం, అమ్మడం నేరం. కానీ ప్రతిస్ర్కాప్‌ దుకాణంలో అవే సామాన్లు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల బయటకు చిన్నపాటి దుకాణాల్లా ఉంటాయి. లోపల మాత్రం పెద్ద పెద్ద గొడౌన్లు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంటుంది. లక్షలాది రూపాయల స్ర్కాప్‌ను స్టాక్‌ చేస్తున్నారు. ఇటువంటి షాపుల్లో ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. స్ర్కాప్‌ దుకాణాలపై సమీప నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరమైన వస్తువులతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. వాటిపై నిఘా లేకపోవడంతో దొంగతనాలకు కూడా కారణమవుతున్నాయి. కేటీపీఎస్ కు చెందిన ఇనుప సామాగ్రి, విద్యుత్‌ శాఖకు సంబంధించి పాత స్తంభాలు, కాలం చెల్లిన ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించి ఇక్కడే విక్రయిస్తున్నారు. గతంలో చాలా కేసులకు సంబంధించి మూలాలు స్ర్కాప్‌ దుకాణంలో బయటపడ్డాయి. కానీ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి, చేతులు దులుపుకుంటున్నారు. పాల్వంచలోని స్క్రాప్ దుకాణాల నుండి నెలవారి మామూళ్లు వివిధ శాఖల అధికారులకు వెళుతుండటంతో వారి వ్యాపారానికి అడ్డు చెప్పే వారే లేకుండా పోయింది. ఇకనైనా అధికారులు స్పందించి జనావాసాల మధ్య స్క్రాప్ దుకణాలను తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :