Wednesday, 25 June 2025 07:31:51 AM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాడిశ బిక్షం దొర # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎడవల్లి కృష్ణ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంఏ.వజీర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్

పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని

Date : 10 June 2024 08:33 PM Views : 576

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కృషి ఫలించింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎర్ర సూర్యుని ఆధ్వర్యంలో నెరవేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్ యూనిట్లు మంజూరు చేయాలని సంబంధిత శాఖ మంత్రికి, శాఖ రాష్ట్ర అధికారులపై ఎమ్మెల్యే కూనంనేని ఒత్తిడి చేయటంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి 5 యూనిట్లతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో 5 డయాలసిస్ మిషన్స్ మాత్రమే అందుబాటులో ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండటంతో, సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే కూనంనేని గత మర్చి నెలలో లేఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం పాల్వంచ ఆస్పత్రికి 5 మిషన్లు మంజూరు చేసింది. త్వరలో వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో రోగికి ఒక్కసారి డయాలసిస్ నిర్వహిస్తే సుమారు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు ప్రైవేటు ఆస్పత్రిలో వెచ్చించాల్సిన పరిస్థితిని అధిగమించి ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రావడంతో నిరుపేదలైన డయాలసిస్ రోగులకు ఊరట లభించినట్లైది. తన విజ్ఞప్తి, లేఖలపై స్పందించి 5 మిషన్లు మంజూరు చేయడంపట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర స్థాయి అధికారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆస్పత్రికి మరో 5 యూనిట్లు మంజూరు కోసం ప్రభుత్వంపై ఒత్తడి తెస్తున్నట్లు, త్వరలో అదనపు యూనిట్లు మంజూరు అవుతాయని తెలిపారు. పేద వర్గాలకు వైద్య సేవలందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి  సారించినట్లు కూనంనేని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :