Monday, 02 March 2026 02:01:46 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని

Date : 10 June 2024 08:33 PM Views : 741

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కృషి ఫలించింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎర్ర సూర్యుని ఆధ్వర్యంలో నెరవేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్ యూనిట్లు మంజూరు చేయాలని సంబంధిత శాఖ మంత్రికి, శాఖ రాష్ట్ర అధికారులపై ఎమ్మెల్యే కూనంనేని ఒత్తిడి చేయటంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి 5 యూనిట్లతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో 5 డయాలసిస్ మిషన్స్ మాత్రమే అందుబాటులో ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండటంతో, సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే కూనంనేని గత మర్చి నెలలో లేఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం పాల్వంచ ఆస్పత్రికి 5 మిషన్లు మంజూరు చేసింది. త్వరలో వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో రోగికి ఒక్కసారి డయాలసిస్ నిర్వహిస్తే సుమారు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు ప్రైవేటు ఆస్పత్రిలో వెచ్చించాల్సిన పరిస్థితిని అధిగమించి ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రావడంతో నిరుపేదలైన డయాలసిస్ రోగులకు ఊరట లభించినట్లైది. తన విజ్ఞప్తి, లేఖలపై స్పందించి 5 మిషన్లు మంజూరు చేయడంపట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర స్థాయి అధికారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆస్పత్రికి మరో 5 యూనిట్లు మంజూరు కోసం ప్రభుత్వంపై ఒత్తడి తెస్తున్నట్లు, త్వరలో అదనపు యూనిట్లు మంజూరు అవుతాయని తెలిపారు. పేద వర్గాలకు వైద్య సేవలందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి  సారించినట్లు కూనంనేని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :