Thursday, 16 April 2026 10:55:08 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే కూనంనేని

Date : 02 March 2024 07:31 PM Views : 741

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : అత్యంత వేగవంతంగా కొత్తగూడెం నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం పాల్వంచ మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాలైన చంద్రాలగూడెం, రేగులగూడెం, మల్లారం, ఉల్వనూర్, సత్యనారాయణపురం, యానంబైల్, ప్రభాత్ నగర్, ఇల్లందులపాడు తండా, సూరారం, సోమలగూడెంలో 45 లక్షల రూపాయల ఎన్ఆర్జిఎస్ విధులతో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ అనతికాలంలోనే పల్లె పల్లెకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు. తనపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ఏజెన్సీ ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించేంతవరకు విశ్రమించనని హామీ ఇచ్చారు. పదికాలాలపాటు అభివృద్ధి పనులు నిలిచి ఉండేలా చేపట్టాలని, నిర్మాణాల్లో ఎలాంటి నాణ్యత లోపించినా ఉపేక్షించేదిలేదని అధికారులు తరచుగా పనులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో రోడ్లు, డ్రైనేజిలు, కల్వర్టులు, ఇతర అభివృద్ధి నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల మౌలిక అవసరాలైన రోడ్లు, డ్రైనేజీలు, త్రాగు నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గతం కంటే మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి సాదించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి, వార్డుకు కనీస మౌలిక వసతులు కల్పించడంతోపాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాష, జెడ్పీటీసీ బరపటి వాసు, తహసిల్దార్ వివేక్, ఎంపీడీవో, పంచాయతీ రాజ్ డిఈ, సిడిపిఓ, రూరల్ ఎస్సై, సిపిఐ నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, చినగారపు శ్రీనివాసరావు, మన్నెం వెంకన్న, కొత్త సురేష్, వైయస్ గిరి, ఎస్కే. పాషా, యు.హరీష్, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, ఎర్రంశెట్టి ముత్తయ్య, కొండం వెంకన్న, కొత్తపల్లి సోమయ్య, పైడిపల్లి దుర్గమహేష్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, విద్యుత్ శాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, గ్రామపంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లు, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :