తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి ఆలయంలో మార్గశిర బహుళ దశమి నుండి ద్వాదశి వరకు 3 రోజులు దేవాలయ పవిత్రత, భక్తుల సర్వ శ్రేయస్సు కొరకు నిర్వహించే పవిత్రోత్సవాలను శనివారం కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు వైభవంగా ప్రారంభించారు. తొలుత దేవస్థాన సిబ్బంది సాంప్రదాయం ప్రకారం కూనంనేని కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి శేషవస్త్ర ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి రజని కుమారి, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ మహిపతి రామలింగం, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాషా, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సర్పంచ్ అనిత, దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు ఎస్వీఆర్కే ఆచార్యులు, నాగమల్లేశ్వరరావు, చింతా నాగరాజు, బేతంశెట్టి విజయ్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, సిపిఐ నాయకులు అడుసుమిల్లి సాయిబాబా, గుండాల నాగరాజు, దుగ్గిరాల సుధాకర్, ముత్యాల కిరణ్ కుమార్, అన్నారపు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కనగాల అనంత రాములు, నల్లమల వేణు, కాపా కృష్ణమోహన్, ఎర్రం శెట్టి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.