Sunday, 07 December 2025 11:58:52 AM
# భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు # కాంపెల్లి కనకేష్ ఇంట... కవితక్క సందడి... # ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్

బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్

Date : 27 November 2025 09:26 AM Views : 1042

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతానని అల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా చందు నాయక్ అన్నారు. బుధవారం పాల్వంచలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నూతనంగా జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంగా సంఘ నాయకులు చందు నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. రద్దయిన జీవో స్థానంలో గిరిజనుల కోసం మరొక జీవోను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే గిరిజనులతో భర్తీ చేయాలని, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ కింద పోడు భూములకు పట్టాదారులు పాసుపుస్తకాలు అందించి, వారికి రైతు బంధు/రైతుభరోసా వంటి పథకాలు వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు భద్రు నాయక్, జగదాంబ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు నాయక్, యువసేన జిల్లా అధ్యక్షులు భరత్, విద్యార్థి విభాగం నాయకులు రాములు నాయక్, సేవాలాల్ సేన నాయకులు పరమేష్ నాయక్, సుజాత, శృతి, వెంకన్న, సభావాత్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :