Tuesday, 28 July 2026 04:26:19 PM
# పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్

కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన

Date : 25 October 2025 04:34 PM Views : 895

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : గో రక్షకులపై దాడి చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని, అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్ వద్ద శుక్రవారం రాత్రి విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ ఖమ్మం విభాగ్ సంయోజక్ మేరుగు చింటేశ్వర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంయోజక్ కుసన సాగర్ లు మాట్లాడుతూ... ఘట్కేసర్ వద్ద గో సంరక్షకుడు సోను సింగ్ పై తుపాకీతో హత్యాయత్నం చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని అరెస్టు చేయడమే కాకుండా, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు గోవులు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని, గో సంరక్షకులకు రక్షణ కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన చెక్ పోస్టు లను ఏర్పాటు చేసి, గో రవాణా ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న గోవద శాలలను వెంటనే మూసివేయాలని, ఇకపై గో సంరక్షకుల పై దాడి జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: