Sunday, 07 December 2025 09:09:00 AM
# భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు # కాంపెల్లి కనకేష్ ఇంట... కవితక్క సందడి... # ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్

ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్

Date : 17 October 2025 08:10 PM Views : 1034

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : పనిభారం తగ్గించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఏఎన్‌ఎంలు భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా ఐహెచ్‌ఐపీ, ఎన్‌సీడీ, 36 రిజిస్టర్లు, నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. హెచ్‌బీ పరీక్షలు, ఫీల్డ్‌ వర్క్‌, డ్రైడే, సమావేశాలతో సమయం సరిపోవడంలేదన్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ రాకపోవడంతో ఇళ్లకు వెళ్లి పని చేస్తున్నామని వాపోయారు. రాత్రి, పగలు పనిచేసినప్పటికి సమయం సరిపోవడం లేదని, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 32 సంవత్సరాల తమ సర్వీసులో ఆనారోగ్యాలతో బాధపడుతూ విధులు నిర్వహిస్తూ, ఎలాంటి పదోన్నతులు లేకుండా పని చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తాము ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నరాటి ప్రసాద్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :