Sunday, 07 December 2025 09:09:00 AM
# భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు # కాంపెల్లి కనకేష్ ఇంట... కవితక్క సందడి... # ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్

ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్

Date : 13 September 2025 04:45 PM Views : 486

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల పరిధిలోని రేగులగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వజ్జా బాబు గత మూడు రోజుల క్రితం గుండెపోటుతో మరణించినాడు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ శనివారం రేగులగూడెం గ్రామానికి వెళ్లి వజ్జా బాబు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె ఝాన్సీ, కుమారుడు రోహిత్, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి దశదిన కర్మలకు 50 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ వజ్జా బాబు మరణం పాల్వంచ మండల బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, పాత ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారని, పాల్వంచ మండలం బిఆర్ఎస్ పార్టీలో చురుకుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవాడని అటువంటి వ్యక్తి మరణించడం పట్ల తీవ్ర దిగ్బంతికి గురయ్యానని, వజ్జా బాబు కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని  అన్నారు. వజ్జా బాబు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పాల్వంచ బిఆర్ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్, పోసారపు అరుణ్, తోట లోహిత్ సాయి, కూరెళ్ళి మురళీమోహన్, కొమ్మాలపాటి నిఖిల్, గజ్జల రితిక్, మరియు రేగులగూడెం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండగాని రమేష్, వజ్జా రామకృష్ణ, వజ్జా లక్ష్మయ్య, ఈసం రాంబాబు, వజ్జా నరసయ్య వజ్జా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :