Thursday, 16 April 2026 10:56:02 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

పాల్వంచ DAV స్కూల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Date : 11 January 2024 09:51 PM Views : 701

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ డిఏవి స్కూల్ లో గురువారం ఘనంగా ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ఎ. రామారావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారని, అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారని అన్నారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారని, మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండుగ యొక్క ప్రాముఖ్యత ను వివరించారు. పాఠశాలలో పల్లె వాతావరణాన్ని సృష్టించి రైతుల గొప్పదనం గురించి వివరించారు. విద్యార్ధినీ లు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. హరిదాసు వేషాలు, గంగిరెద్దు, బసవన్న వేష దారులు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్ధినీ, విద్యార్థులూ భోగి మంటల చుట్టూ చేసిన నృత్యాలు వీక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ వెంకటేశ్వర్లు, కృష్ణారావు, రాజశేఖర్, సుష్మ, శేషు కుమారి, చంద్రకళ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :