తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మహిళా భరోసా కేంద్రానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన మహిళా అభ్యర్థుల నియామకాల కొరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భరోసా సెంటర్ భద్రాద్రి కొత్తగూడెం నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్(01),సపోర్ట్ పర్సన్(02),లీగల్ సపోర్ట్ పర్సన్(01),మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం(01) పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సర్వీస్ రెగ్యులరైజేషన్ హక్కులు లేకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన భరోసా సెంటర్ కొరకు మహిళా ఉద్యోగులను భర్తీ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు 21.01.2024 నుండి 01.02.2024 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ ఉద్యోగ నియామకాలు ఒక సంవత్సరం కాల వ్యవధి కొరకు మాత్రమేనని,అనంతరం అదే కాల వ్యవధి ఆవశ్యకత, బడ్జెట్ ప్రకారం ప్రతి సంవత్సరం పొడిగించబడుతుందని అన్నారు. బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తగిన పత్రాలన్నింటిని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఇన్ వార్డ్ సెక్షన్ లో అందించాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ 01.02.2024 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ఇ.విజయ్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఏదైనా సమాచారం కొరకు షీటీమ్ ఎస్.ఐ రమాదేవిని 8712682131 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించగలరని తెలిపారు.