తెలంగాణ / లిబర్టీ న్యూస్ : స్వేచ్ఛా స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం తాజా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ తో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.