తెలంగాణ / లిబర్టీ న్యూస్ : స్వాతంత్ర్య భారతావనికి దశ, దిశ చూపిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన మహోన్నతమైన రోజును జరుపుకునే గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ప్రముఖ వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ దొప్పలపూడి సురేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం అంత ముఖ్యమని అన్నారు. అనంతరం మెరుపు వేగంతో వార్తలను అందిస్తున్న లిబర్టీ న్యూస్ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ తో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లమల సత్యం, వీరంరెడ్డి రామచంద్ర రెడ్డి, ఈదరా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.