తెలంగాణ / లిబర్టీ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం దమ్మపేట పర్యటన ముగించుకొని పాల్వంచ మీదుగా కొత్తగూడెం వెళుతుండగా పాల్వంచ శ్రీనివాస కాలనీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పాల్వంచ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా, పూర్ణకుంభం, మేళ తాళాలతో సుమారు 500 మంది పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు న్యాయవాది అయిత గంగాధర్, పిసిసి సభ్యులు నాగ సీతారాములు, కొమర్రాజు విజయ్, బి.ఎన్ చారి,ఖరీం పాషా, సాంబయ్య, ఇమ్మన్యూల్, ఆనంద్, బబ్లూ,వినయ్, మోహన్, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు ఖాజామియా, హుస్సేన్ నాయక్, లింగ్యా నాయక్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఓలపల్లి రాంబాబు, ఉదయ్, సత్తార్, మహిళా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ రెడ్డి, బండి కాంతమ్మ, శికా మేరీ తదితరులు పాల్గొన్నారు.