తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని నెహ్రూనగర్ నివాసి సిఖా నరసింహులు కు చెందిన సర్వే నెం.802 లోని 1.26 కుంటల భూమి పై మల్లెల రవిచంద్ర అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రవేశించి అక్రమించాలని ప్రయత్నం చేస్తున్నాడని దళిత సంఘ నాయకులు అన్నారు. శుక్రవారం పాల్వంచ వజ్ర హోటల్ లో దళిత,బిసి,మైనారిటీ, వివిధ రాజకీయపార్టీల అధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిఖా నరసింహులు కు చెందిన భూమిపైకి అక్రమంగా చొరబడితే సహించేది లేదని హెచ్చరించారు. మల్లెల రవిచంద్ర ఆర్థిక బలం, రాజకీయ బలం తో దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అన్నారు. సర్వే నెంబర్ 802, 805 ల పై సర్వే చేయించి, భూమి ఎవరి పేరు మీద ఉన్నదో అధికారులు నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఖా కృష్ణ, సిఖా అరుణ, సిఖా భూషణం, కాల్వ భాస్కర్ రావు, కాల్వ ప్రకాష్ రావు, సీపీఐ నాయకులు బండి నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర కామేష్, మాల మహానాడు జాతీయ కార్యదర్శి శివ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమర్రాజు విజయ్, ఓలపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.