Monday, 02 March 2026 12:29:27 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

దళితుల భూమి ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోం..

Date : 01 March 2024 01:58 PM Views : 1941

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని నెహ్రూనగర్ నివాసి సిఖా నరసింహులు కు చెందిన సర్వే నెం.802 లోని 1.26 కుంటల భూమి పై మల్లెల రవిచంద్ర అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రవేశించి అక్రమించాలని ప్రయత్నం చేస్తున్నాడని దళిత సంఘ నాయకులు అన్నారు. శుక్రవారం పాల్వంచ వజ్ర హోటల్ లో దళిత,బిసి,మైనారిటీ, వివిధ రాజకీయపార్టీల అధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిఖా నరసింహులు కు చెందిన  భూమిపైకి  అక్రమంగా చొరబడితే సహించేది లేదని హెచ్చరించారు. మల్లెల రవిచంద్ర ఆర్థిక బలం, రాజకీయ బలం తో దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అన్నారు. సర్వే నెంబర్ 802, 805 ల పై సర్వే చేయించి, భూమి ఎవరి పేరు మీద ఉన్నదో అధికారులు నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఖా కృష్ణ, సిఖా అరుణ, సిఖా భూషణం, కాల్వ భాస్కర్ రావు, కాల్వ ప్రకాష్ రావు, సీపీఐ నాయకులు బండి నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర కామేష్, మాల మహానాడు జాతీయ కార్యదర్శి శివ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమర్రాజు విజయ్, ఓలపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :