Monday, 02 March 2026 02:00:17 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

ప్రజా నాయకుడు రవిచంద్ర జోలికొస్తే ఊరుకోం

Date : 02 March 2024 09:29 PM Views : 1193

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : పాల్వంచ ప్రజా నాయకులు మల్లెల రవిచంద్ర జోలికి వస్తే సహించేది లేదని ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీ, అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. శనివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిమందికి ఉపయోగపడే ప్రజా నాయకుడు మల్లెల రవిచంద్ర పై కావాలని కొంతమంది కుట్రపూరితంగా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా దురుద్దేశంతో తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని అన్నారు. పాల్వంచలోని సర్వే నంబర్ 802 లో 1.26 కుంటల భూమిని మల్లెల రవిచంద్ర ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సర్వే నెంబర్ 805 లోని భూమిని చట్టపరమైన అన్ని  హక్కులతో మల్లెల రవిచంద్ర విక్రయించారని, భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్  తీసుకొని ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు వచ్చేందుకు మల్లెల రవిచంద్ర సిద్ధంగా ఉన్నాడని, అతనిపై ఆరోపణలు చేస్తున్న వారు అఖిలపక్ష రాజకీయ నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసుకొని చర్చకు రావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో బేతంశేట్టి విజయ్, తేజావత్ సాధు నాయక్, బండి వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రాజశేఖర్, భూక్య బాలకృష్ణ, సీత, ఇమ్రాన్, పాష,బాల స్వామీ, బోల్లేపోగు రవి, నంబూరి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :