Saturday, 27 July 2024 02:04:27 PM
# ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి # హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు # చదువులో వెలిగిన కాంపెల్లి కిరణ్మయి # నేను పోలీస్ ఇన్ ఫార్మర్ ని...!! # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కిన్నెర ఏజెన్సీస్ # శభాష్ సుభాని

ఇసుక నిల్వలు అక్రమమా.. సక్రమమా..?

Date : 21 March 2024 12:05 PM Views : 478

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పూనుకుల గ్రామం వద్ద యాష్ పాండ్ కట్టపై సుమారు 70 లారీల ఇసుకను పాల్వంచ రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అనంతరం రెవిన్యూ అధికారులు ఇసుకకు సంబంధించిన పత్రాలు అడుగగా..  కాంట్రాక్టర్ వద్ద ఉన్నాయని యాష్ పాండ్ సిబ్బంది తెలిపారు. ఇసుకకు చెందిన బిల్లులను పాల్వంచ తహశీల్దార్ కార్యాలయానికి తీసుకురావాలని యాష్ పాండ్ సిబ్బంది కి సూచించారు. ఇసుక నిల్వలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోతే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు. కాగా ఈ  ఇసుక సమీప ప్రాంతాలైన కిన్నెరసాని వాగు, గుర్రాలకుంట, తిమ్మంపేట నుండి అక్రమంగా తీసుకువచ్చారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఇసుక నిలువలను సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :