Sunday, 07 December 2025 12:15:47 PM
# భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు # కాంపెల్లి కనకేష్ ఇంట... కవితక్క సందడి... # ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్

మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

Date : 14 April 2024 11:29 AM Views : 1673

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ నందు శనివారం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ జి. రాజు మాట్లాడుతూ  గత 13 సంవత్సరాలుగా విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దటంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ ముందంజలో ఉందని తెలిపారు. తల్లిదండ్రుల ఆదరణ, సహకారం, ప్రోత్సాహంతో   13 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 14వ సంవత్సరంలోకి అడుగుడినట్లు తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు, అనాధ పిల్లలకు సాధ్యమైనంతవరకు ఉచిత విద్యాబోధన చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ జి రాజు ఆధ్వర్యంలో అతిధులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షులు ముర్తుజా ఆలీ ఖాన్, లీడ్ స్కూల్ డైరెక్టర్ రెంటాల నాగభూషణం, ఏ.డి.ఈ విజయ్ కుమార్, జన విజ్ఞాన వేదిక జనరల్ సెక్రెటరీ తిరుపతిరావు, ఉపాధ్యాయులు అశోక్, అన్వేష్, డాన్స్ మాస్టర్ శ్యామ్, నాగలక్ష్మి, సంధ్య, గీత రత్నమణి, విజయ, పద్మ, అనిత, గాయత్రి, శిరీష, కోటేశ్వరి, గ్రామ ప్రజలు,  సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :