Thursday, 16 April 2026 10:57:40 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే కూనంనేని

Date : 17 September 2024 10:04 PM Views : 1572

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని డిఏవి, త్రివేణి, రెజీనా స్కూల్ లలో చదువుకుంటున్న పలువురు విద్యార్థులు వెళుతున్న ఆటోను ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న డి.ఏ.వి స్కూల్ విద్యార్థి ఈశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన విద్యార్థులు తీవ్ర గాయాలు కాగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రుల కుటుంబాలను ఓదార్చారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కూనంనేని వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి SK.సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, మైనారిటీ రాష్ట్ర నాయకులు నయింఖురేషి, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :