Monday, 02 March 2026 01:58:51 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

ఈడీ దాడులు రాజకీయ కుట్ర : నూకల రంగారావు

Date : 28 September 2024 06:47 PM Views : 1370

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఈడీ దాడులు బిజెపి పార్టీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల రంగారావు అన్నారు.  శనివారం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూకల రంగారావు కాంగ్రెస్ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బిజెపి భయపెట్టాలని చూస్తుందని, బిజెపి వ్యతిరేక పక్షాలపై నిరంతరం ఈడి దాడులు చేయడమే లక్ష్యం గా పెట్టుకుందన్నారు. కర్ణాటకలో కూడా బిజెపి ఇదే తరహాలో ముందుకు సాగిందని, డీకే శివప్రసాద్ పై కూడా ఇలానే దాడులు ప్రయోగం చేశారని అన్నారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను కూడా వదలకుండా కేంద్రంలోని బిజెపి ఈడి దాడులు చేయించింది అని తెలిపారు. ఈడీ దాడులతో కాంగ్రెస్ కు ఏ విధమైన నష్టం జరగదని, రానున్న హర్యానా,జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.  రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం శ్రమిస్తున్నట్లు నూకల రంగారావు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్.డి.ఎమ్ కోర్డినేటర్ బద్ది కిషోర్, ఎస్సీ సెల్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు పెంకి శ్రీనివాస రావు, పాల్వంచ రూరల్ ఓబిసి అధ్యక్షులు కట్టా సోమయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాము నాయక్, మైనారిటీ కాంగ్రెస్ జిల్లా నాయకులు షేక్ దస్తగిరి, నాయకులు సాంబయ్య, చాంద్, హుస్సేన్ నాయక్, జల్లారపు నాగేశ్వర రావు, వేమా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :