Tuesday, 16 December 2025 05:53:12 PM
# భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు # కాంపెల్లి కనకేష్ ఇంట... కవితక్క సందడి... # ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్

వైద్యులను సన్మానించిన కొత్వాల

Date : 12 December 2024 07:03 PM Views : 1434

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగులకు సకాలంలో సేవలు అందిస్తున్నారని, వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం జాతీయ స్థాయిలో NQAS సర్టిఫికెట్ తో ప్రశంసించిందని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి కి జాతీయ స్థాయిలో గుర్తింపు లబించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కొత్వాల నాయకత్వంలో వైద్యులను ఘనంగా సన్మానించారు. గురువారం కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రి RMO డాక్టర్ సోమరాజు దొర, ఆసుపత్రి సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ రాంప్రసాద్ లతో పాటు పలువురు డాక్టర్లును సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ వైద్యులు దేవుళ్లతో సమానమని, రోగుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత డాక్టర్లదేనన్నారు. వైద్య సేవలు పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమాల్లో కొత్వాల తోపాటు పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, యూత్ కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు పైడిపల్లి మహేష్, మెలిగ మహేష్, కాంగ్రెస్ నాయకులు Y.వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, గంధం నర్సింహారావు, మస్నా శ్రీనివాస్, ఉండేటి శాంతివర్ధన్, ప్రసాద్, మల్లేష్, దేవా, రాము, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :