తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఇటీవల నూతనంగా నిర్మాణమై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించబడిన పాల్వంచ ప్రెస్ క్లబ్ కు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మందడపు ముక్కంటేశ్వర రావు 55వేల రూపాయల విలువైన 55" టివి, హోమ్ థియేటర్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించారు. శుక్రవారం బిసిఎం జాతీయ రహదారి పక్కనున్న పాల్వంచ ప్రెస్ క్లబ్ భవనంలో విలేకరులందరి సమక్షంలో టీవీని అందజేసి ప్రారంభించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ ముక్కంటేశ్వర రావు ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ ముక్కంటేశ్వర రావు మాట్లాడుతూ పాల్వంచ మీడియా మిత్రుల కోరిక మేరకు 55 వేల రూపాయలతో టీవీ, హోమ్ థియేటర్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్. సంజీవ్ కుమార్, చండ్ర నరసింహారావు, కార్యదర్శి షేక్ సుభాని, ఎం.ఎ. రజాక్, వెంకట నారాయణ, ఏ.అబ్బురాం, ఎం.ఎ. వాజిద్, జగదీష్, పవన్, రామ్మోహన్ గౌడ్, పుల్లారావు, భద్రం, శనగా రామచందర్, సంతోష్, దారా శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.