Friday, 17 April 2026 02:42:52 AM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

పాల్వంచలో జోరుగా మట్టి తవ్వకాలు

Date : 28 December 2024 04:29 PM Views : 1659

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పుల్లాయిగూడెంకు చెందిన ఓ రైతు పొలంలో నుండి ఓ కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తోలకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని దిగమింగుతూ, ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. కేటిపిఎస్ ఏదో దశకు చెందిన రెండో యాష్ పాండ్ అభివృద్ధి పనుల కోసం సంస్థ 25 కోట్ల నిధులను విడుదల చేసింది. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కావేరీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ కాంట్రాక్టర్ గత సంవత్సరం పనులను మొదలు పెట్టారు. అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ 2024 వరకు పనులు పూర్తి చేయాలి.. ఇంత వరకు యాభై శాతం పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది. చట్టలను గౌరవిస్తూ, ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన సదరు సంస్థ ఆది నుండి ఏజెన్సీ చట్టాలను, అధికారులను బేఖాతర్ చేస్తూ పనులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకానొక దశలో తాను చేస్తున్న అక్రమాలకు అధికారులు సహకరించకుంటే పనులను మద్యలోనే నిలిపివేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారనే వదంతులు పాల్వంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. యాష్ పాండ్ కు కావలసిన మట్టి తోలకాలకు, ఇసుక, కంకర సంభంధిత మైనింగ్ శాఖ అధికారుల నుండి అనుమతులు తీసుకోవాలి. అనుమతుల మేరకు మట్టి తవ్వకాలు చేపట్టాలి. కానీ సదరు గుత్తేదారు ప్రభుత్వ నిబంధనలు లెక్కచేయకుండా, అనుమతులు తీసుకోకుండా స్థానిక రైతులను మభ్యపెట్టి వారి పొలాల నుండి యధేశ్చగా మట్టి తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కోట్ల విలువైన మట్టిని యధేశ్చగా కొల్లకొడుతున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతూ, పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతామంటూ ... భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే పుకార్లు శికార్లు చేస్తున్నాయి. అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :