తెలంగాణ / లిబర్టీ న్యూస్ : నూతన సంవత్సరం 2025 లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు పాల్వంచ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 2025లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన ఉంటుందన్నారు.