తెలంగాణ / లిబర్టీ న్యూస్ : నూతన సంవత్సరం 2025 లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రంగాపురం మాజీ సర్పంచ్ మాలోత్ హరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.