Thursday, 10 July 2025 09:50:15 AM
# ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాడిశ బిక్షం దొర # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎడవల్లి కృష్ణ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంఏ.వజీర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు

మున్నూరు కాపులకు అండగా ఉంటా: కాంపెల్లి కనకేష్

Date : 05 March 2024 07:17 PM Views : 798

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మున్నూరు కాపు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలకు సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ డిమాండ్ చేశారు.  ఇదే అంశంపై మంగళవారం పాల్వంచ తహసిల్దార్ వివేక్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ లో 5 కుల ధ్రువీకరణ పత్రాలు, ఈ ఏడాది జనవరిలో 2 తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పాల్వంచలో మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు మున్నూరు కాపు కులస్తులకు కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి వలస వచ్చిన తూర్పు కాపు, ఇతర కులాల వారికి జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి తప్పుడు మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే రద్దు చేసి, ఆ కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై, సహకరించిన వారందరిపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఉండే దళారులకు రూ.30 వేల నుండి రూ.40 వేల వరకు ఇచ్చి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారని, తూర్పు కాపులైన వారు తప్పుడుగా మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు పొందటానికి డబ్బులు చెల్లిస్తుంటే నిజమైన మున్నూరు కాపులకు తాసిల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల విషయంలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగితే సహించబోనని, మున్నూరు కాపులకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల ఆనంద్ పటేల్, మెడిశెట్టి సాంబశివరావు పటేల్, తోట ప్రవీణ్ పటేల్, తోట లోహిత్ సాయి పటేల్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :