Tuesday, 28 July 2026 06:19:32 PM
# పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్

మున్నూరు కాపులకు అండగా ఉంటా: కాంపెల్లి కనకేష్

Date : 05 March 2024 07:17 PM Views : 1015

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మున్నూరు కాపు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలకు సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ డిమాండ్ చేశారు.  ఇదే అంశంపై మంగళవారం పాల్వంచ తహసిల్దార్ వివేక్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ లో 5 కుల ధ్రువీకరణ పత్రాలు, ఈ ఏడాది జనవరిలో 2 తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పాల్వంచలో మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు మున్నూరు కాపు కులస్తులకు కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి వలస వచ్చిన తూర్పు కాపు, ఇతర కులాల వారికి జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి తప్పుడు మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే రద్దు చేసి, ఆ కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై, సహకరించిన వారందరిపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఉండే దళారులకు రూ.30 వేల నుండి రూ.40 వేల వరకు ఇచ్చి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారని, తూర్పు కాపులైన వారు తప్పుడుగా మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు పొందటానికి డబ్బులు చెల్లిస్తుంటే నిజమైన మున్నూరు కాపులకు తాసిల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల విషయంలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగితే సహించబోనని, మున్నూరు కాపులకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల ఆనంద్ పటేల్, మెడిశెట్టి సాంబశివరావు పటేల్, తోట ప్రవీణ్ పటేల్, తోట లోహిత్ సాయి పటేల్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: